రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు 2023 జాతీయ పంచాయతీ అవార్డులను ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , ఎంపీడీవో చిరంజీవి, తహసిల్దార్ జయంత్ కుమార్ లు కలిసి ఆయా గ్రామ పంచాయతీ సర్పంచులకు, ఎంపీటీసీ సభ్యులకు పంచాయతీ కార్యదర్శులకు మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం అందజేశారు, ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ 2023 జాతీయ గ్రామపంచాయతీ అవార్డులను తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేయడం గొప్ప విషయమని అన్నారు.

ప్రత్యేకంగా జాతీయ గ్రామపంచాయతీ అవార్డులను గౌరవప్రదంగా ఉండేందుకు గ్రామ సర్పంచులకు ఎంపీటీసీ సభ్యులకు పంచాయతీ కార్యదర్శులకు అందజేసినందుకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.వివిధ గ్రామాల సర్పంచులకు,పంచాయతీ కార్యదర్శి కి ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య లు కలిసి ప్రశంస పత్రము అందజేసి శాలువాలతో వారిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు కొండాపురం బాల్ రెడ్డి, ఎం పి ఓ వజీర్ హైమద్, వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీ సభ్యులు,పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.







