రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం లో గల మోడల్ స్కూల్ కు వెళ్లే దారిలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గుంతల్లో నీరు నిలిచి దారి మొత్తం బురదగా మారింది,దీంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు,సిబ్బందికి ఇబ్బందిగా మారడంతో, పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్ స్పెషల్ ఆఫీసర్ జయశీల దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన ఆఫీసర్ గ్రావెల్ మట్టితో రోడ్డుపై గుంతలు పూడ్చి మరమ్మతులు చేయించారు.
కాగా పాఠశాల యాజమాన్యం,విద్యార్థులు ఆఫీసర్ జయశీలకు కృతజ్ఞతలు తెలిపారు.