సాధారణంగా ఒక సినిమాలో హీరోనే బాగా హైలైట్ అవుతాడు.పాటలకు డ్యాన్స్లు చేస్తాడు.
రౌడీలతో అదిరిపోయే ఫైట్లు చేస్తాడు.చాలా ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా నటిస్తూ ఆకట్టుకుంటాడు.
రొమాన్స్, కామెడీ ఇలా అన్ని రకాల రసాలను పండించే మిగతా నటీనటుల కంటే సినిమాని మరింత రక్తి కట్టిస్తాడు.హీరో క్యారెక్టర్జేషన్ కూడా బాగుంటుంది.
మొత్తం మీద ఏ సినిమాలోనైనా హీరో ఒక్కడిదే డామినెన్స్ కనబడుతుంది.కానీ కొన్ని సినిమాల్లో కొందరు టాలెంటెడ్ యాక్టర్స్ ఏకంగా హీరోలనే డామినేట్ చేశారు.
మరి ఆ యాక్టర్స్ ఎవరు? వారు హీరోలను డామినేట్ చేసిన ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
ధ్రువ – అరవింద్ స్వామి
సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధ్రువ (2016) రామ్ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఇందులో రామ్ చరణ్( Ram Charan) టైటిల్ రోల్ లో యాక్ట్ చేసి మెప్పించాడు.అరవింద్ స్వామి, రకుల్ ప్రీత్ సింగ్ కీ రోల్స్ పోషించారు.
ఇది తమిళ చిత్రం తని ఒరువన్ (2015)కి రీమేక్.అయితే ఈ సినిమాలో హీరోగా చేసిన రామ్ చరణ్ కంటే అరవింద్ స్వామి( Aravind Swamy,)కే ఎక్కువ పేరు వచ్చింది.
ఇందులో విలన్ గా చేసినా అరవింద్ చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు.స్టైలిష్గానూ మెరిశాడు.
అదిరిపోయే స్క్రీన్ ప్రజెన్స్తో మంటలు పుట్టించాడు.టోటల్గా చెర్రీని సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకు డామినేట్ చేశాడు.
సొంతం – సునీల్
2002లో విడుదలైన రొమాంటిక్ కామెడీ ఫిలిం “సొంతం” సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, నమిత, రోహిత్, సునీల్, నేహా పెండ్సే నటించారు.దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలోని కామెడీ పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వించింది.అందుకే అది బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ రిజిస్టర్ చేసింది.అయితే ఈ మూవీలో ఆర్యన్ రాజేషే హీరో కానీ ఈ సినిమాని సింగిల్ హ్యాండ్గా డామినేట్ చేసింది మాత్రం కమెడియన్ సునీలే అని చెప్పుకోవాలి.ఇందులో సునీల్ శేషగిరి అలియాస్ శేషంగా యాక్ట్ చేసి మెప్పించాడు.
మార్క్ ఆంటోనీ – ఎస్జే సూర్య
ఈ సినిమాలో హీరో విశాల్ కానీ ఎస్జే సూర్య మూవీ మొత్తం డామినేట్ చేశాడు.ఇందులో సూర్య తన నట విశ్వరూపం చూపించాడు.
జై భీమ్ –
జై భీమ్( Jai Bhim ) సినిమాలో సూర్య నటన అదిరిపోయింది అని చెప్పాలి.
అయితే ఆయన కంటే ఈ మూవీలో లిజోమోల్ జోస్ మరింత అద్భుతంగా నటించింది.ఈమె చిన్న తల్లి క్యారెక్టర్ లో చూపించిన పర్ఫామెన్స్ కు థియేటర్లలో ఈలలు, చప్పట్లు పడ్డాయి.