దొంగతనం కేసులో ఒక వ్యక్తికి 4 నెలల కారాగారా శిక్ష విధిస్తూ వేములవాడ ప్రథమశ్రేణి న్యాయమూర్తి జ్యోతిర్మయి శుక్రవారం తీర్పు వెల్లడించినట్లు వేములవాడ పట్టణ సి.ఐ వీర ప్రసాద్ తెలిపారు.
ఈ మేరకు సి.ఐ మాట్లాడుతు వేములవాడ పట్టణానికి చెందిన తిప్పపూర్ గ్రామానికి చెందిన మైలారం శ్రీనివాసు తండ్రి పేరు రాములు వయస్సు 37 సంవత్సరంలు అనునతని కరెంటు మోటార్ వైర్ దొంగతనంనకు పాల్పడిన గుండారం గంగారం తండ్రి పేరు పెద్దగంగారం వయసు 32 సంవత్సరాలు గ్రామం వీరన్న గుట్ట నిజామాబాద్ జిల్లా.
తేది.17-06-2024 రోజున వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కి తరలించడం జరిగిందని తెలిపారు.విచారణ అనంతరం విచారణ అధికారి ఎస్.ఐ అంజయ్య కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా CMS ఎస్.ఐ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ సురేష్ కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారు.ప్రాసిక్యూషన్ తరుపున P.విక్రాంత్ కేసు వాదిoచగా పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి జ్యోతిర్మయి నేరస్థుడు గుండారం గంగారం కు నాలుగునెలల కారాగార జైలు శిక్ష విధించినట్లు సి.ఐ తెలిపారు.