సూర్యాపేట జిల్లా: పాలకవీడు మండలం భవానిపురం డెక్కన్ సిమెంట్ కర్మాగారంలో 39వ గనుల భద్రత వారోత్సవాలను సోమవారం ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఎన్.శ్రీనివాసరాజు,చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్.
నాగమల్లేశ్వరరావుప్రారంభించారు.ఈ సందర్భంగా కర్మాగారంలో నేటి నుండీ 26 వరకు వారోత్సవాలు జరుగుతాయన్నారు.2024 సంవత్సరపు గనుల భద్రత నినాదం చేశారు.గని ప్రదేశాలలో వ్యక్తిగత భద్రత పరికరాలు ధరించి అవగాహనతో ఉండాలన్నారు.భద్రత నియమాలను పాటించినప్పుడే తమ కుటుంబాలకు సంస్థకు రాబోయే తరాల వారికి భద్రతతో కూడిన వాతావరణాన్ని అందించిన వారవుతారని అన్నారు.39వ,గనుల భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని కార్మికులందరికీ యాజమాన్యం తరఫున స్వీట్లు పంపిణీ చేసి గని ప్రదేశాలలో అనునిత్యం అనుసరిస్తున్న పటిష్టతకై మరిన్ని భద్రతా కార్యక్రమాల కార్యచరణను రూపకల్పన చేశారు.