ఆర్ఎంపీ కూతురికి ఎంబీబీఎస్ లో సీటు - పలువురి అభినందనలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఓ ఆర్ఎంపీ కూతురు ఎంబీబీఎస్ లో సీటు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచింది.ఎల్లారెడ్డిపేట మండలం నారాయణ పూర్ గ్రామానికి చెందిన పాముల శ్రీనివాస్ లత దంపతుల కూతురు పావని నీట్ లో ప్రతిభ కనబరిచి పటాన్ చెరులోని టీఆర్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎంబీబీఎస్ సీటు సాధించింది.

 Mbbs Seat For Rmp Daughter, Mbbs Seat , Rmp Daughter, Pavani ,rajanna Sircilla D-TeluguStop.com

తండ్రి శ్రీనివాస్ ఆర్ఎంపీ వైద్యుడు, తల్లి లత గృహిణి.

పావని పదో తరగతి వరకు మండలం లోని విజ్ఞాన్ స్కూల్ లో, ఇంటర్ హైదరాబాద్ నారాయణ కళాశాలలో చదివినట్లు పేర్కొన్నారు.

తన తండ్రి పాతికేండ్లుగా వైద్య సేవలు అందిస్తున్నాడు.అది చూసి లక్ష్యాన్ని పెట్టుకున్న కూతురు ఎంబీబీఎస్ లో సీటు సాధించి నాన్న కలను నెరవేర్చింది.పీ జీలో స్పెషలైజే షన్ చేసి పేదలకు వైద్య సేవలందిస్తానని విద్యార్థి పావని తెలిపారు.తన కుమారుడు పవన్ సాయి కూడా ఎంబీబీఎస్ చేస్తుండడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

విద్యార్థులను పలువురు గ్రామస్తులు అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube