గుండెపోటుతో గీత కార్మికుడు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ఓ గీతా కార్మికుడు వృత్తిరీత్యా కళ్ళు తీస్తుండగా గుండెపోటు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం… మండలంలో దుమాల గ్రామానికి చెందిన కదిరే ఎల్లయ్య (49) అనే గీత కార్మికుడు కులవృత్తిని నమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

 Gita Worker Died Of Heart Attack , Kadire Ellaiah, Sagar, Shravan-TeluguStop.com

గురువారం ఉదయం యధావిధిగా కళ్ళు గీసేందుకు ఎల్లమ్మ తాళ్లల వద్దకు వెళ్లి చెట్లకు కళ్ళు గీస్తున్న క్రమంలో ఒకసారిగా కుప్పకూలాడు.వెంటనే తోటి గౌడ సభ్యులు హుటా హుటిన మండలంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకురాగా అప్పటికే అతడు గుండెపోటుతో మృతి చెందాడు అని,వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకొని కన్నీటి పర్యాంతమయ్యారు.

మృతునికి భార్య వనజ, కుమారులు సాగర్, శ్రవణ్, కూతురు మమత లు ఉన్నారు.కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న ఎల్లయ్య ఇలా విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందిన తీవ్ర దిబ్బంతికి కలగజేసిందని, వారి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని స్థానిక గౌడ కులస్తులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube