సిరిసిల్ల పట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా సూర దేవరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా సూర దేవరాజు మాట్లాడుతూ సిరిసిల్లలో సేవలను గుర్తించి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా రెండోసారి అవకాశం కల్పించిన పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి, జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు,
నాగుల సత్యనారాయణ, కేకే మహేందర్ రెడ్డి, సంగీతం శ్రీనివాస్ లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డ్ లను ప్రతి గడపకు చేరే విధంగా కృషి చేస్తానని తెలిపారు.పార్టీని మరింత బలోపేతంగా ప్రజల్లో చేరే విధంగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.