రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ క్లబ్( Anti-Drugs Club ) లో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కళాశాలల్లో చిత్రాలేఖనం పోటీలు నిర్వహించడం జరిగింది.
విద్యార్థినీ, విద్యార్థులకు మాధకద్రవ్యాల నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలు, అవగాహనపై చిత్రలేఖనం (పెయింటింగ్) పోటీలు వేములవాడ రూరల్ మండలం లోని అన్ని ప్రభుత్వ పాఠశాల లలో నిర్వహించడం జరిగింది.
ఇందులో భాగంగా మర్రిపల్లి కస్తూర్బా బాలికల పాఠశాలలో లో నిర్వహించిన చిత్రలేఖనం కార్యక్రమం లో వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ పాల్గొన్నారు.







