పలువురికి సన్మానం - రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో

రాజన్న సిరిసిల్ల జిల్లా: నూతనంగా రెడ్డి సామాజిక వర్గం రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్( Employees Professional Association ) ఏర్పాటు చేసుకున్నారు.

 Employees Professional Association ,rajanna Sirisilla District , Yellareddypet-TeluguStop.com

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో బుధవారం రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు ఇటీవల పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులు నేవూరి హరికా రెడ్డి, తోకల దీక్షిత్ రెడ్డి, గుర్రాల స్ఫూర్తి రెడ్డి, పొన్నాల తన్విక రెడ్డి తో పాటు వారి తల్లిదండ్రులను అదేవిధంగా ఆపదలో ఉన్న ఆపద్బాంధవుడు సుమారు 47 సార్లు రక్తదానం చేసిన వంగ గిరిధర్ రెడ్ది, ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, జాతీయ అవార్డు గ్రహీత ముత్యాల ప్రభాకర్ రెడ్ది, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నాయిని భాస్కర్ రెడ్డి( Bhaskar Reddy )లను ఘనంగా శాలువాలు కప్పి సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మరింత ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని తల్లిదండ్రులకు గౌరవంతో పాటు ఉజ్వల భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రేపా అసోసియేషన్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube