రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఇందిరా చౌక్ ప్రాంతంలో 969/ఆ, సర్వే నెంబర్లులో చెట్పల్లి రవీంద్ర తండ్రి సత్యనారాయణ, గసికంటి అరుణ్ ( Gasikanti Arun )తండ్రి నరసయ్య ,కంట నరసయ్యకు స్థల వివాధం కోర్టులో కేసు నడుస్తుండగా,ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్ మంజూరు చేయగా, గరిపట్టి ధ్రువపత్రం బిల్లుతో సెస్ కార్యాలయాల్లో కరెంట్ మీటర్ సాంక్షన్ కోసం చెక్ పెళ్లి రవీంద్ర ఏలాంటి కన్స్ట్రక్షన్ లేకుండా తప్పుడు పత్రాలతో 5377 నెంబర్ తో మీటర్ మంజూరు చేసారని సదరు లబ్ధిదారులకు నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేయడం ఎంతవరకు సమాజసమని బాధితుడు గసికంటి అరుణ్ పత్రికా ముఖంగా పిలుపునిచ్చారు.కాళీ స్థలానికి మీటరు మంజూరు చేయడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు.
ఇట్టి మీటర్ సాంక్షన్ పై సెస్ అధికారులను సంప్రదించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూన్నారని అన్నారు.ఎలాంటి ఇల్లు నిర్మాణం లేని ఖాళీ ప్లేస్ కు మీటర్ సాంక్షన్ చేసిన ఆధికారులుపై తక్షణమే చర్యలు చేపట్టి తప్పుడు ధృవ పత్రాలు సమర్పించిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు అరుణ్ కోరారు.