నకిలీ మద్యం కేసులో తెలంగాణ ఎక్సైజ్ శాఖ దర్యాప్తు ముమ్మరం

తెలంగాణలో బయటపడిన నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఒడిశా నుంచి తెలంగాణకు నకిలీ మద్యం సరఫరా చేసినట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది.ఇటీవలే ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించి సుమారు రూ.3 కోట్ల విలువైన నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు.

 Telangana Excise Department's Investigation Into Fake Liquor Case Is In Full Swi-TeluguStop.com

ఒడిశాలోని కటక్ లో నకిలీ మద్యం తయారీ స్థావరాన్ని అధికారులు కనుగొన్నారు.అనంతరం రూ.1.20 కోట్ల విలువైన 20 వేల లీటర్ల నకిలీ విస్కీని సీజ్ చేశారు.ఒడిశాలో తయారు చేసి తెలంగాణ బ్రాండ్ పేరుతో మద్యం విక్రయాలు సాగుతున్నట్లు గుర్తించారు.ఈ నేపథ్యంలోనే తెలంగాణ నకిలీ టేబుల్ షీట్లు, తయారీ సామాగ్రితో పాటు భారీగా నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా ఈ కేసులో ఇప్పటికే 26 మందిని టీఎస్ ఎక్సైజ్ శాఖ అరెస్ట్ చేయగా మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు.నకిలీ మద్యం కేసులో శివారెడ్డి, బాలరాజు గౌడ్ తో పాటు సంజయ్ అనే వ్యక్తిని కీలక నిందితులుగా అధికారులు నిర్ధారించారు.

ఆగస్ట్ నుంచి ఈ మద్యాన్ని తయారు చేస్తున్నట్లు నిందితులు విచారణలో వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube