ఆ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు..!!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు.రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పశ్చిమ రాయలసీమ అభ్యర్థిగా భూమి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, తూర్పు రాయలసీమకు కంచర్ల శ్రీకాంత్ పేర్లను ప్రకటించారు.

 Chandrababu Announced The Candidates For That Election Chandrababu, Tdp ,bhumi R-TeluguStop.com

టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది.ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా పోరాడాలని నాయకులకు పిలుపునిచ్చారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలు ఇతర ప్రజా సంఘాల నుండి మద్దతు వచ్చినా గాని ప్రధాన రాజకీయ పక్షాలు బరిలోకి దిగడంతో ఈ ఎలక్షన్స్ ప్రతిష్ఠిత్మకంగా మారాయి.ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చిలో ఖాళీగా ఉన్న మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలలో ఎవరు గెలుస్తారు అన్నది ఉత్కంఠ భరితంగా మారింది.

ఈ ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీ టీడీపీ కంటే ముందుగానే అధికార పార్టీ వైసీపీ  అభ్యర్థులను ప్రకటించడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube