వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి మంచి జోష్ లో ఉంది.151 సీట్లు దక్కడం, అన్ని వర్గాల ప్రజలకు చేరువ అయ్యేలా కొత్త కొత్త పథకాలను ప్రకటిస్తూ జగన్ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.జగన్ ఐదేళ్లు కాదు, మరో పదిహేనేళ్ళు సీఎం అంటూ వైసీపీ శ్రేణుకు కూడా ఉత్సాహంగా చెప్తున్నాయి.జగన్ జోష్ ఇలా సాగుతుంటే తెలుగుదేశం పార్టీలో తీవ్ర సంక్షోభం నెలకొంది.
చంద్రబాబు వయస్సు మీరడం, కొత్త నాయకత్వం లోకేష్ కు దక్కే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుండడంతో తెలుగుదేశం నాయకుల్లో మరింత ఆందోళన పెరిగిపోయి పార్టీ వలసలకు కారణం అవుతోంది.ఇటువంటి సమయంలో జగన్ ను ఎదుర్కోవడం అంటే ఆషామాషీ కాదు అనేది అందరికి అర్ధం అయిపొయింది.
ఇక దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్న బీజేపీ ఏపీ మీద కన్నేసింది.ఎలా అయినా ఏపీలో బలపడాలని చూస్తున్న ఆ పార్టీ ఎలాగూ టీడీపీ ఖాళీ అవ్వడం ఖాయం కనుక ఆ స్థానాన్ని దక్కించుకుని రానున్న రోజుల్లో ఏపీలో పాగా వేయాలని చూస్తోంది.
ఈ నేపధ్యంలో జగన్ ను ఢీ కొట్టాలంటే బాగా ఇమేజ్ ఉన్న వారే ఉండాలి.జనంలో పలుకుబడి ఉన్నవారు, పాపులరిటీ కలిగిన వారు ఉండాలి.
బీజేపీ ఇపుడు అదే విషయమై తీవ్ర ఆలోచనలో పడింది.ఎంతమంది పార్టీలో చేరినా ఇమేజ్ ఉన్న నాయకుడు ఏపీలో లేకపోతే ఇక్కడ బలపడడం చాలా కష్టమనే ఒక అంచనాకు వచ్చారు.
ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ మీద కన్నేసింది బీజేపీ.మెగా బ్రదర్స్ పవన్, చిరు సొంతంగా పార్టీలు పెట్టి అధికారం దక్కించుకోవడంలో విఫలం అయినా మెగా అభిమానులు, కాపు సామజిక వర్గం అండదండలు వీరికి పుష్కలంగా ఉండడంతో బీజేపీ మెగా ఫ్యామిలీని ఎలా అయినా పార్టీలో చేర్చుకోవాలని చూస్తోంది.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపాడమే కాకుండా ఆయనకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చూస్తోంది.దీంతో పాటు చిరు కి రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేయాలనే ఆలోచనలో ఉందట.
అంతేకాకుండా ఏపీలో పార్టీకి నాయకత్వం వహిస్తే ఆ తరువాత మీకు అన్నిరకాలుగా ఉపయోగపడతామంటూ ఆఫర్లు కూడా ఇస్తున్నారట.చిరంజీవి ఈ ప్రతిపాదలనకు ఒప్పుకుంటే ఏపీలో బీజేపీ బలపడినట్టేనని బీజేపీ భావిస్తోంది.
ఒకవేళ ఈ ఆఫర్ కు చిరు ఒప్పుకోకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అయినా ఒప్పించాలని బీజేపీ చూస్తోంది.గతంలోనే జనసేన పార్టీని బీజేపీలో కలిపేయమని అమిత్ షా చెప్పారని ఏకంగా పవనే చెప్పుకున్నారు.
ఇప్పుడు కూడా అదే ప్రతిపాదన పెట్టాలని బీజేపీ చూస్తోంది.మొత్తంగా చిరు, పవన్ లలో ఎవరో ఒకరిని ఒప్పించి బీజేపీని బలోపేతం చేయాలనీ బీజేపీ ప్లాన్ చేస్తోంది.