ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతున్నటువంటి ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె సర్జరీ ద్వారా ట్రాన్స్ జెండర్ గా మారింది.
తాజాగా బిగ్ బాస్ లో ఉన్న ప్రియాంకకు తెలంగాణ రాష్ట్ర సమితి హిజ్రా ఫౌండర్ స్పోక్స్ పర్సన్ చంద్రముఖి షాకింగ్ న్యూస్ చెప్పారు.ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి ప్రియాంక ఎవరో మాకు తెలియదని, ఆమె మా కమ్యూనిటీలో లేదని అందుకే మేము ఆమెకు సపోర్ట్ చేయమని హిజ్రా ఫౌండర్ చంద్రముఖి తెలియజేశారు.
గత సీజన్లో బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తమన్నా మా కమ్యూనిటీ లో ఉంది కనుక ఆమెకు మేము సపోర్ట్ చేసాము.అయితే ఈమె ఇండిపెండెంట్ గా ట్రాన్సజెండర్ గా మారింది ఈమె సాయి తేజ్ గా మాత్రమే మాకు తెలుసు కానీ ప్రియాంక సింగ్ గా మాకు తెలియదని అందుకే మా మద్దతు తనకు ఉండదని తెలిపారు.
మేము కేవలం మా కమ్యూనిటీలో ఉండే వారికి మాత్రమే మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఇలా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి 19 మంది కంటెస్టెంట్ లో ప్రస్తుతం 10 మంది మాత్రమే హౌస్ లో ఉన్నారు.వీరిలో జెస్సీ సీక్రెట్ రూమ్ లో ఉండగా మిగిలిన తొమ్మిది మంది పలు టాస్క్ లో పాల్గొన్నారు.ఇక ఈ వారం నామినేషన్ లో ఉన్న వారిలో అందరికన్నా కాజల్ కి మద్దతు తక్కువగా ఉండటం వల్ల కాజల్ డేంజర్ జోన్లో ఉందని ఈ వారం కాజల్ బయటకు వస్తుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
మరి ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారు అనేది తెలియాల్సి ఉంది.