రియల్ హీరో సోనూసూద్ లాక్ డౌన్ కు ముందు ప్రేక్షకులకు నటుడిగా మాత్రమే సుపరిచితం కాగా లాక్ డౌన్ తర్వాత సేవా కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల దృష్టిలో సోనూసూద్ తన ఇమేజ్ ను పెంచుకున్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేని పనులను సైతం శరవేగంగా చేస్తూ సోనూసూద్ ఎంతోమందిని ఆదుకుంటున్నారు.
తన దయాగుణం ద్వారా సోనూసూద్ స్టార్ హీరోలను మించిన పాపులారిటీని సంపాదించుకున్నారు.
సోషల్ మీడియాలో సోనూసూద్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతాఇంతా కాదు.
తాజాగా సోనూసూద్ తెలుగు బిగ్ బాస్ షో గురించి స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బిగ్ బాస్ షో తెలుగు సీజన్ 5లో శ్రీరామచంద్రను మీరు చూస్తున్నారా? అని సోనూసూద్ ప్రశ్నించడంతో పాటు నేనూ బిగ్ బాస్ షోను చూస్తున్నానని సోనూసూద్ చెప్పుకొచ్చారు.బిగ్ బాస్ హౌస్ లో శ్రీరామచంద్ర బెస్ట్ ఇవ్వాలని సోనూసూద్ కామెంట్లు చేశారు.
శ్రీరామచంద్రకు ఇవే నా ప్రేమాభినందనలు అని సోనూసూద్ కామెంట్లు చేశారు.
లవ్ యూ మ్యాన్ అంటూ సోనూసూద్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.సోనూసూద్ మద్దతు ప్రకటించడంతో శ్రీరామచంద్ర బిగ్ బాస్ విన్నర్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.కొందరు బాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం శ్రీరామచంద్రకు సోషల్ మీడియా వేదికగా మద్దతును ప్రకటించడం జరిగింది.
ఇండియన్ ఐడల్ షో విన్నర్ గా నిలవడం ద్వారా శ్రీరామచంద్ర దేశవ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు.బిగ్ బాస్ హౌస్ లో కూల్ గా ఉంటూ శ్రీరామచంద్ర మిస్టర్ కూల్ గా పేరును సొంతం చేసుకున్నారు.స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా శ్రీరామచంద్ర పాపులారిటీని అంతకంతకూ పెంచుకోవడం గమనార్హం.
స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సైతం శ్రీరామచంద్రకు ఇప్పటికే మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.మరి శ్రీరామ్ విన్నర్ గా నిలుస్తారో లేదో చూడాల్సి ఉంది.