పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది.చాలాకాలంగా బకాయిపడ్డ ఉద్యోగుల జీతాలు, భారీగా పెరిగిన అప్పులు తీర్చేందుకు వేరే మార్గం లేక, పాక్ ప్రభుత్వం వాషింగ్టన్ లోని( Washington ) పాక్ ఆస్తులను వేలంలో ఉంచింది.ఈ క్రమంలో అమెరికాలోని అమ్మేందుకు పెట్టిన ఎంబసీ కార్యాలయం 7.1 మిలియన్ డాలర్లకు అమ్ముడైందని విశ్వసనీయ వర్గాల సమాచారం.వాషింగ్టన్ లోని పాకిస్తాన్ చారిత్రాత్మక భవనమైన ఎంబసీ బిల్డింగ్( Pakistan Embassy ) 2003 నుంచి ఖాళీగానే వుంటుందనే విషయం అందరికీ తెలిసినదే.దాంతో 2018లో దౌత్య హోదాను కూడా కోల్పోయింది.అయితే, ఈ భవనాన్ని కొనుగోలు చేసేందుకు భారత్కు చెందిన ఓ రియాల్టీ సంస్థతో సహా పలు సంస్థలు పోటీపడగా చివరకు పాకిస్తాన్ కు చెందిన బిజినెస్ మెన్ హఫీజ్ ఖాన్ దీన్ని 7.1 మిలియన్ డాలర్లకు దక్కించుకున్నాడు.
పాకిస్థాన్కు వాషింగ్టన్లో 2 చోట్ల ఎంబసీ ఆఫీసులు ఉండడం గమనార్హం.ఆర్ స్ట్రీట్లో ఉన్న ఈ బిల్డింగ్ ను 1956లో కొనుగోలు చేయగా, 2000 వరకు అందులో కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగాయి.కాకపోతే పాకిస్థాన్ ( Pakistan )గత దశాబ్దకాలానికి పైగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది.దాంతో క్రమేపీ అందులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి.డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా( District Of Columbia ) ఈ బిల్డింగ్ ను దుర్భర స్థితిలో ఉన్న ఆస్తుల లెక్కలో చేర్చడంతో దీని అంచనా విలువతో పాటు టాక్స్ కూడా భారీగా పెరిగింది.శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనాన్ని కొనుగోలు చేసేందుకు గతేడాది బిడ్ లను పాకిస్థాన్ ప్రభుత్వం ఆహ్వానించింది.
ఆ తరువాత ఈ బిల్డింగ్ త్వరితగతిన మార్చిన పాకిస్తాన్ అధికారిక వర్గం ఎటువంటి వివరణ ఇవ్వకుండానే బిడ్డింగ్ ప్రక్రియను నిలిపి వేసింది.ఒకపుడు క్లాస్ -2 హోదాలో ఉన్న ఈ భవనం ఆ తర్వాత క్లాస్-3 కి, ఇప్పుడు క్లాస్-4 స్థాయికి పడిపోవడం కొసమెరుపు.ఇది పాక్ ప్రభుత్వం ఫెయిల్యూర్ గా అక్కడి మీడియాలో అనేక కధనాలు వెలువడడం మనం చూసాం.ఆఖరికి పాకిస్థాన్ కు ఆర్థికమాంద్యం దెబ్బకు దానిని అమ్ముకునే దుస్థితి పట్టింది మరి.