న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి:ఎస్ఐ సైదిరెడ్డి హెచ్చరిక

సూర్యాపేట జిల్లా: చింతలపాలెం మండలం( Chintala Palem )లో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్ఐ సైదిరెడ్డి కోరారు.కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని బైక్ రైడింగ్,త్రిబుల్ రైడింగ్ చేయడం,ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం,రాకపోకలకు అంతరాయం కలిగించడం, భారీ స్పీకర్లు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం,రోడ్లపై మద్యం సేవిస్తూ తిరగడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

 New Year Celebrations Should Be Celebrated Peacefully: Si Saidireddy Warns ,new-TeluguStop.com

ఇలాంటి వాటిని అరికట్టడానికి తమ సిబ్బందిని అన్ని ప్రదేశాల్లో నిఘా ఉంచామన్నారు.

ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎస్సై వెల్లడించారు.

నూతన సంవత్సర వేడుకలను( New Year celebrations ) ప్రశాంత వాతావరణంలో,ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వహించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.మండల ప్రజలకు ఎస్ఐ సైదిరెడ్డి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube