అధికారం మీద ఎంతైనా ఆశ ఉండొచ్చు గాని అది సాదించే పట్టుదల మాత్రం అందరికీ ఉండదు .నారా లోకేష్ పాదయాత్ర ప్రకటించినప్పుడు గానీ అది ప్రారంభమైనప్పుడు గాని సామాన్య జనం లో ఎవరికి ఏ రకంగానూ అంచనాలు లేవు .
తన వర్గం అనుకూలం మీడియాతో అంతా బాగానే ఉంది అంటూ మేనేజ్ చేస్తారని అనవసరమైన హైప్ ని క్రియేట్ చేస్తారని అంచనాలు వచ్చాయి.అయితే జిల్లాలు దాటేకొద్ది వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా లోకేష్ ( Nara Lokesh ) చూపిస్తున్న పట్టుదల చాలామందికి ఇప్పుడు ఇప్పుడు ఆ అంచనాలు తప్పని అభిప్రాయం కలుగుతుంది .లోకేష్ .పాదయాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లాలో జరుగుతూ ఉంది.
ఆ జిల్లా కీలక నేత జెసి ప్రభాకర్ రెడ్డి( JC Prabhakar Reddy ) లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు లోకేష్ పట్టుదలను తెలిపే విధంగా ఉన్నాయి.తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం లోకేష్ తో మూడు రోజులు తిరిగానని 40 డిగ్రీల ఎండలో మూడు రోజులు తిరిగినందుకే తనకు మూర్చ వచ్చినంత పని అయ్యిందని కానీ గత రెండు నెలలుగా అలుపెరగకుండా ఆయన పార్టీ కోసం కష్టపడుతున్నాడని ,చాలా త్యాగాలు చేసి చంద్రబాబు దంపతులు ఈయనను ప్రజల్లోకి పంపించారని మాట్లాడుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు.
లోకేష్ అంకితభావం చూస్తుంటే ఎన్టీరామారావు కి వచ్చిన స్థాయిలో ప్రజాధరణ లోకేష్ కూడా వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు….మరి ఏ రకంగా చూసిన మండే ఎండలు కూడా లెక్క చేయకుండా పాదయాత్రను ముందుకు తీసుకెళుతున్న లోకేష్ తీరుని కచ్చితంగా కొనియాడాల్సిందే .రాజకీయంగా కూడా కార్యకర్తలతోనూ ద్వితీయ శ్రేణి నాయకులతోనూ లోకేష్ మాట్లాడుతున్న విధానం, వారిని సమన్వయం చేసుకుంటున్న తీరు కచ్చితంగా లోకేష్ ఒక పరిణితి చెందిన నాయకుడి గా మారుతున్నాడు అనడానికి ఒక నిదర్శనంగా చెప్పవచ్చు.
పాదయాత్ర ముందు వరకు తనకు కోప నరం ఉండేదని ప్రజల కష్టాలు చూసిన తర్వాత తాను వీటన్నిటికీ అతీతంగా మారిపోయానని వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆయన పాదయాత్ర గురించి తరచూ చెబుతుండేవారు…… ఇప్పుడు ప్రజల సమస్యలను కష్టాలను దగ్గర్నుంచి చూస్తున్న లోకేష్ కూడా సంపూర్ణ నాయకుడు గా తనను తాను ఆవిష్కరింప చేసుకుంటాడని భవిష్యత్తు ముఖ్యమంత్రిగా సత్తా చూపిస్తాడని తెలుగుదేశం శ్రేణులు అంచనా వేస్తున్నాయి .మరి లోకేష్ కష్టానికి తగిన ప్రతిపలం దక్కుతుందో లేదో చూడాలి.