మెక్సికోలో మృత్యు దేవతను ‘శాంటా ముర్టే’ పేరుతో నమ్మే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.ఈ దేవత ఆరాధన మెక్సికోను దాటి మధ్య అమెరికా, కొలంబియాకు కూడా వ్యాపించింది.
మృత్యుదేవత తమను అనారోగ్యంతో పాటు కష్టాల నుండి కాపాడుతుందని వారు నమ్ముతారు.అయితే ఈ నమ్మకాన్ని విశ్వసించే వారిని కాథలిక్ చర్చి విమర్శిస్తుంది.
గతేడాది మెక్సికో వచ్చిన పోప్ ఫ్రాన్సిస్ కూడా ఇలాంటి శక్తులను నమ్మేవారిని తీవ్రంగా విమర్శించారు.కొందరు ఈ ఆధ్యాత్మిక చర్యల ప్రజాదరణ పెరుగుదలను.
మెక్సికోలో నేరాలు, హింసల పెరుగుదలతో ముడిపెట్టారు.మృత్యు దేవత తన అనుచరులను లొంగదీసుకుంటుందనే వదంతులు కూడా వినిపించాయి.
అయితే ఈ ఆరాధనను నమ్మే చాలా మంది ప్రజలు ఇవన్నీ కేవలం వదంతులు మాత్రమేనని, ఇది తమ విశ్వాసానికి సంబంధించిన విషయమని, ఇందులో చెడు లేదని పేర్కొన్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం, మెక్సికోలోని ‘శాంటా ముర్టే’ని విశ్వసించే ఆచారం చాలా పురాతనమైది.
ఎందుకంటే అది అక్కడి సంప్రదాయానికి సంబంధించినది.
వలసరాజ్యాల కాలంలో దేశాన్ని స్పానిష్ స్వాధీనం చేసుకోవడంతో కాథలిక్కులు ఇక్కడకు వచ్చారు.
చాలా మంది రహస్యంగా మృత్యు దేవతపై తమ విశ్వాసాన్ని సజీవంగా కొనసాగిస్తున్నారు.అయితే మృత్యు దేవత అనుచరులు ఈ వాస్తవాన్ని గతంలో బహిరంగంగా అంగీకరించలేదు.
అదే సమయంలో గత కొద్ది కాలంగా వారు దానిని బహిరంగంగా అంగీకరించడం ప్రారంభించారు.దీనికి సంబంధించిన ప్రార్థనా స్థలాలు కూడా చాలా చోట్ల తెరుచుకున్నాయి.
నేరాలకు పేరొందిన తైపిటో పట్టణంలో గత 15 సంవత్సరాలుగా డోనా క్యూర్టా అనే మహిళ ఇంట్లో ప్రార్థన స్థలాన్ని ఏర్పాటు చేసింది.మృత్యుదేవత అనుచరులు దేశం నుంచే కాకుండా విదేశాల నుండి కూడా ఇక్కడికి రావడం ప్రారంభించారు.
ఆయా ప్రార్థనా స్థలాలలో అస్థిపంజరానికి అలంకరణలు చేసి పూజిస్తారు.ఇది మరణ దేవతకు అంకితమైన మెక్సికోలోని మొట్టమొదటి ప్రజా ప్రార్థన స్థలంగా భావిస్తారు.