గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని( Kodali Nani ) సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు తన సొంత గ్రామం చంద్రగిరిలో 25 ఏళ్లుగా గెలవలేకపోయారు.
చంద్రగిరిలో వేసి గృహాలు పేకాట క్లబ్ లు పెట్టడంతో ప్రజలు తల్లి తరిమేసారని సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు గుడివాడ వచ్చి ఖాళీ కుర్చీలకు గంట ఉపన్యాసం ఇచ్చారు.
నేనంటే చంద్రబాబు( Chandrababu Naidu )కి భయం.
అందువల్ల రెండు రోజులు గుడివాడ చుట్టూ తిరిగారు.గుడివాడలో తనను ఓడించాలని రెండుసార్లు చంద్రబాబు పిలుపునిచ్చారు.కానీ వాళ్లే ఓడిపోయారని కొడాలి నాని తెలిపారు.2024లోనూ అదే రిపీట్ అవుతుందని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూడా స్పందించారు.కేంద్రం ఈ విషయంలో రోజుకో మాట మాట్లాడుతుందని విమర్శించారు.నిన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదన్నారు.
ఈరోజు ఉంది అని అంటున్నారు.ఇది కరెక్ట్ కాదు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ పూర్తిగా వ్యతిరేకమని కొడాలి నాని తెలిపారు.
నష్టం లేకుండా స్టీల్ ప్లాంట్ కు గనుల కేటాయించాలని కేంద్రాన్ని అడుగుతున్నట్లు స్పష్టం చేశారు.ప్రెస్ ప్రకటనల వల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుందని అనుకోవటం BRS అమాయకత్వం అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో ఒకసారి ఢిల్లీ వెళ్లి ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే పవన్ కీ పోరాటమా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెడితే కేంద్రం వెనక్కి తగ్గిపోతుందా.? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ( Vizag Steel Plant ) ఆపటానికి వైఎస్ జగన్ తన వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.అంటూ కొడాలి నాని స్పష్టం చేశారు.