కార్తికేయ హీరోగా నటించిన రాజా విక్రమార్క సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా లో కార్తికేయ పాత్ర చాలా విభిన్నమైన పోలీస్ పాత్ర అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఈ వారంలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.ఇప్పటి వరకు పోలీస్ స్టోరీస్ చాలా చాలా వచ్చాయి.
కాని ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంటుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.సినిమాలో హీరో పాత్ర కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని అంటున్నారు.
ఈ సినిమా తన సినీ కెరీర్ లోనే చాలా కీలకమైన సినిమా అంటూ కార్తికేయ చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు.ఆయన వ్యాఖ్యలతో సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో సినిమాపై అంచనాలు పెరిగాయి.
ప్రేక్షకులు కూడా సినిమా తప్పకుండా చూడాలనే ఆసక్తిని కనబర్చుతున్నారు.
హీరోగా ఆర్ ఎక్స్ 100 సినిమా తో పరిచయం అయిన కార్తికేయ ఆ తర్వాత వరుసగా సినిమాలను చేశాడు.
బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ సినిమాలుగా ఆయన సినిమాలు నిలువలేదు.కాని నటుడిగా ఆయనకు మంచి పేరు మాత్రం వచ్చింది అనడంలో సందేహం లేదు.ప్రతి సినిమా లో కూడా ఆయన నటన చాలా ప్రత్యేకంగా నిలిచింది.ఇటీవల విడుదల అయిన చావు కబురు చల్లగా సినిమా కూడా మంచి టాక్ ను దక్కించుకోలేక పోయింది కాని మాస్ బస్తీ బాలరాజ్ పాత్రలో కార్తికేయ నటించిన తీరు ఆకట్టుకుంది అంటున్నారు.
పెద్ద ఎత్తున అంచనాల నడుమ రూపొందిన అజిత్ వాలిమై సినిమా లో విలన్ పాత్రలో కార్తికేయ నటించిన విషయం తెల్సిందే.సినిమా చిత్రీకరణ సమయంలోనే కార్తికేయ అంటే అజిత్ కు అభిమానం ఏర్పడింది.అలాంటి మంచి నటుడు అయిన కార్తికేయ నటించిన రాజా విక్రమార్క ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.