టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ ప్రొడ్యూసర్లలో అల్లు అరవింద్ ఒకరనే సంగతి తెలిసిందే.అల్లు అరవింద్ కొడుకులు అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇండస్ట్రీలో హీరోలుగా గుర్తింపును సొంతం చేసుకున్నారు.
అయితే అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకున్న అల్లు బాబీ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న గని అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.మీడియా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలలో అల్లు బాబీ ఎన్నో అద్భుతాలను సృష్టించారు.గీతా ఆర్ట్స్ నిర్మించే సినిమాలకు సంబంధించి అల్లు బాబీ తెర వెనుక ఉండి కీలక పాత్రను పోషించారు.
జస్ట్ టికెట్స్ వెబ్ సైట్ ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఆన్ లైన్ మూవీ టికెట్ పోర్టల్ ను ప్రారంభించారు.అల్లు బాబీ విదేశాల్లో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ చేయడం గమనార్హం.
టెక్నాలజీ ఇంటర్ ప్రీటర్ గా అల్లు బాబీ కెరీర్ ను మొదలుపెట్టారు.దాదాపు 15 సంవత్సరాల పాటు ఎన్విరాన్మెంట్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ తో పాటు ఐటీ రంగం అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నారు.
అల్లు బాబీ ప్రస్తుతం జస్ట్ టికెట్స్ కు ఛైర్మన్ గా ఉన్నారు.అల్లు బాబీ అసలు పేరు అల్లు వెంకటేష్ కాగా అతనిని అందరూ అల్లు బాబీ అని పిలుస్తారు.
అల్లు అరవింద్ ఓటీటీ అయిన ఆహా ఓటీటీ సక్సెస్ కావడం కొరకు అల్లు బాబీ ఎంతగానో కృషి చేశారు.
సినిమా రంగంలో గడిచిన కొన్నేళ్లలో అల్లు బాబీ ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు.గని సినిమాతో అల్లు బాబీ సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది.అల్లు అర్జున్, అల్లు శిరీష్ కెరీర్ లో సక్సెస్ కావడానికి అల్లు బాబీ ఎంతగానో కృషి చేస్తున్నారు.