ప్రస్తుత కరోనా కాలంలో మన శరీరంలో అధిక మొత్తంలో రోగనిరోధకశక్తి ఉంటే కరోనా నుండి కాపాడుకోవచ్చని భావిస్తున్నారు.అంతేకాకుండా సాధారణంగా వచ్చే వ్యాధులతో పోరాడాలి అంటే మన శరీరంలో రోగనిరోధకశక్తి ఎంతగానో ఉపయోగపడుతుంది.
అలాంటి రోగనిరోధక శక్తిని మెరుగుపర్చుకోవడానికి పౌష్టికాహారం తీసుకోవడమే కాకుండా రోజుకు ఒక గ్లాస్ జ్యూస్ ను తాగడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి కరోనా వైరస్ కు చెక్ పెట్టచ్చు.అయితే ఎలాంటి జ్యూస్ తాగాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
క్యారెట్, ఆపిల్, నారింజ పండ్ల మిశ్రమాన్ని కలిపి రోజూ ఒక గ్లాస్ జ్యూస్ తాగడం ద్వారా శరీరం తనను తాను రక్షించుకోవటంమే కాకుండా అనేక రకాల అంటు వ్యాధులతో పోరాడుతుంది.యాపిల్, నారింజ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మన శరీరానికి కావలసినంత రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
అలాగే క్యారెట్లో విటమిన్ బి సిక్స్ ఉండటం వల్ల రోగనిరోధక శక్తి కణాలను విస్తరించడంతో పాటు, యాంటీబాడీలు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి.
కివి, స్ట్రాబెర్రీ ఈ రెండింటి మిశ్రమాన్ని తాగడంవల్ల నిమోనియా లేదా ఫ్లూ వంటి శ్వాసకోస ఇన్ఫెక్షన్ల ప్రమాదం నుండి తగ్గిస్తుంది ఇందులో విటమిన్ సి, విటమిన్ డి పుష్కలంగా లభిస్తాయి.
కివి రక్తకణాలను మెరుగుపరచడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి.
పుచ్చకాయలో విటమిన్ సి ఇంకా అర్జీ నిన్ అధికంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కాకుండా, కండరాల నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
ఈ పండ్లలో అధిక శాతం నీరు ఉండడం వల్ల రక్త సరఫరాని సులభతరం చేస్తుంది.ఇలాంటి జ్యూస్ లను రోజుకు ఒక గ్లాస్ తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెంచుకోవడమే కాకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యల భారీ పడకుండా ఉండవచ్చు.
చూశారుగా.ఈ జ్యూస్ తాగితే కావాల్సినంత రోగనిరోధక శక్తి పెరిగి కరోనా వైరస్ కు చెక్ పెట్టచ్చు.