దారుణం : కన్న కూతుర్ని చంపి.. తిరిగి కేసు పెట్టారు..?

కులం మతం అనే తేడాలు రోజురోజుకీ కనుమరుగవుతున్న ఈ రోజుల్లో అక్కడక్కడా పరువు హత్యలు తెరమీదికి వస్తూనే ఉన్నాయి, తాజాగా ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది.అనంతపురం జిల్లా గౌరిబిదనూరు తాలూకాలోని హులికుంట గ్రామంలో లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం మిస్టరీ వీడింది.

 Family Killed Their Own Daughter, Family, Daughter Murdered, Ananthapuram, Hindu-TeluguStop.com

ఇక ఈ మృతదేహం విచారణలో సంచలన నిజాలు బయటపడ్డాయి.

వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా హిందూపురం మండలం తూముకుంట చెక్ పోస్ట్ వద్ద నివాసముంటున్న రామాంజినమ్మ కుమార్తె సంధ్య హిందూపురానికి చెందిన చంద్రశేఖర్ ప్రేమించుకుంటున్నారు.

వీరిద్దరూ ఇప్పటికే రెండుసార్లు ఇంటి నుంచి బయటకు వెళ్లారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మళ్లీ వీరిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఇలా తమ కూతురు ప్రియుడితో వెళ్లి పోవడం కారణంగా పరువు పోతుందని భావించిన ఆ యువతి కుటుంబ సభ్యులు.ఆ యువతిని హత్య చేయాలని ప్లాన్ వేశారు.

అనుకున్నట్లుగానే సదరు యువతిని దారుణంగా హత్య చేసి యువతి మృతదేహానికి బండ రాయిని కట్టి సమీపంలోని చెరువులో పడేసారు.అంతేకాదు ఈ హత్య తమ మీదికి రాకుండా పోలీస్ స్టేషన్ వెళ్లి తమ కూతురు కనిపించడం లేదంటూ కేసు పెట్టారు.

ఇక ఈ కేసు విచారణలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు నిందితులను కటకటాల వెనుకకు తోసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube