మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.శివాజీ చౌక్ లో హిందూ సంఘం కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఛత్రపతి శివాజీపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని వారిపై చర్యలు తీసుకోవాలని నిరసన కార్యక్రమం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో హిందూ సంఘం కార్యకర్తలు భారీగా తరలిరావడంతో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని తెలుస్తోంది.దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
మరోవైపు కొల్హాపూర్ లో పోలీసులు భారీగా మోహరించారు.