ఏసుక్రీస్తు దయ వలనే భారత్ లో కరోనా తగ్గిందన్న వ్యాఖ్యలపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు.తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారన్నారు.
తన వ్యాఖ్యలపై వివాదం సృష్టించడం కలచివేసిందని తెలిపారు.కామెంట్స్ పై తప్పుడు ప్రచారాలు చేయడం దురదృష్టకరమని చెప్పారు.
అన్ని మతాలను ఒకేలా చూస్తానన్న డీహెచ్ ఎవరి నమ్మకాలను కించపరచను అని పేర్కొన్నారు.దయచేసి యూట్యూబ్ లో ఉన్న పూర్తి వీడియోను చూడాలని సూచించారు.