YCP : ఏపీలో పొలిటికల్ హీట్.. తాడేపల్లిలో వైసీపీ నేతల కీలక భేటీ..!!

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది.ఈ మేరకు తాడేపల్లి వైసీపీ వార్ రూమ్ లో పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తుంది.

 Political Heat In Ap Key Meeting Of Ycp Leaders In Tadepalli-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేతలతో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ( Sajjala Ramakrishna Reddy, MP Mithun Reddy ) సమావేశం అయ్యారు.రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది.

కాగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేరికతో పార్టీలో మారనున్న సమీకరణాలపై దృష్టి పెట్టారు.ఈ క్రమంలోనే కాకినాడ లేదా పిఠాపురం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పోటీ చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో పవన్ కు చెక్ పెట్టేలా వైసీపీ ( YCP )వ్యూహాలు రచిస్తోంది.

అదేవిధంగా జగన్ ఎన్నికల ప్రచారంపైనా కూడా వైసీపీ నేతలు చర్చించనున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube