జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జనసేన, టీడీపీ పొత్తు ఉందని ఎప్పుడో చెప్పామని తెలిపారు.
పొత్తును జన సైనికులే జీర్ణించుకోలేకపోతున్నారని అనిల్ కుమార్ పేర్కొన్నారు.పక్కా ఆధారాలతోనే చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసిందని తెలిపారు.
రాజధాని ఇన్నర్ కేసులోనూ మరి కొంతమంది జైలుకు వెళ్లక తప్పదని చెప్పారు.ఏపీలో ఏం చేయాలని లోకేశ్ ఢిల్లీలో ఏం చేస్తారని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన బంగాళాఖాతంలో కలవడం ఖాయమని ఎద్దేవా చేశారు.