తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.కేసీఆర్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని చెప్పారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఈసారి అవకాశం ఇవ్వండని కోరారు.కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఎంపీ కోమటిరెడ్డి శ్రీశైలం, కల్వకుర్తి, శ్రీరాంసాగర్ లాంటి ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేశామని పేర్కొన్నారు.
ఉమ్మడి ఏపీలో తెలంగాణ అభివృద్ధి కోసం కోట్లాడింది తామని చెప్పారు.ఎస్ఎల్ బీసీని బీఆర్ఎస్ ప్రభుత్వం అటకెక్కించిందని మండిపడ్డారు.
కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన గుర్తు చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేల కోట్లు సంపాదించారన్న కోమటిరెడ్డి ఉచిత కరెంట్ ను వ్యతిరేకించిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు.
డబ్బుల కోసం మద్యం టెండర్లు మూడు నెలల ముందే వేశారని మండిపడ్డారు.