అమరావతి ప్రాంతంలోని ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది.ఈ మేరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ పై స్టే ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.ఈ క్రమంలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది.
కాగా అమరావతిలో స్థానికేతురలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణం అంశం గత కొన్ని రోజులుగా కోర్టులో సాగుతున్న విషయం తెలిసిందే.