గౌడ మిత్రుల సహాయంతో బాధిత కుటుంబానికి నగదు నిత్యవసరాల అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా : గత తొమ్మిది రోజుల క్రితం కారు బోల్తా పడిన ఘటనలో దుర్మరణం చెందిన గంట దుర్గయ్య గౌడ్ కుటుంబానికి తోటి గౌడ మిత్రులు నగదు నిత్యవసరాల సరుకులు బాధిత కుటుంబానికి అందజేశారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కేసీఆర్ నగర్ రెండు పడకల గదుల నివాస గృహంలో బాధిత కుటుంబానికి 5000 నగదు 50 కిలోల బియ్యం నిత్యవసర సరుకులు అందించారు.

 With The Help Of Gowda Mitra The Affected Family Will Receive Cash And Essential-TeluguStop.com

రెక్కాడితె గాని డొక్కాడని నిరుపేద గీత కార్మిక కుటుంబానికి చెందిన గంట దుర్గయ్య గౌడ్ అకాల మరణంతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.భార్య రేణుక కూతుర్లు అక్షిత, ఆకాంక్ష, కొడుకు శ్రీకర్ గౌడ్ లు ఉన్నారు.

దుర్గయ్య గౌడ్ తోటి గౌడ మిత్రులు తలో కొంత విరాళాల ద్వారా 11000 సేకరించి ఐదువేల నగదు 50 కిలోల బియ్యం నిత్యవసర సరుకులు అందజేశారు.బాధిత కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ ఆదుకోవాలని గౌడ మిత్రులు కోరారు.

ఈ కార్యక్రమంలో గౌడ మిత్రులు ఎల్లారెడ్డిపేట పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు గంట శ్రీనివాస్ గౌడ్ , గంట బాలా గౌడ్, చింతకింది కిషన్ గౌడ్, గంట శ్రీనివాస్ గౌడ్, గంట దేవయ్య గౌడ్, గంట ఎల్లా గౌడ్, వరదవెల్లి శ్రీనివాస్ గౌడ్, బుచ్చి లింగం సంతోష్ గౌడ్, మల్లుపల్లి రమేష్ గౌడ్, గంట శ్రీనివాస్ గౌడ్, వరద వెళ్లి నాగరాజుగౌడ్, గంట స్వామి గౌడ్, గంట వెంకటేష్ గౌడ్, గనగొని నర్సాగౌడ్, చింతకింది శ్రీనివాస్ గౌడ్, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube