కేసీఆర్ పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకుండా కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

ఈ క్రమంలోనే కర్ణాటకలోని సుమారు 25 మంది కాంగ్రెస్ నేతలతో కేసీఆర్ మాట్లాడారని చెప్పారు.ఫామ్ హౌజ్ కు పిలిచి మాట్లాడిన విషయం పార్టీ అధిష్టానానికి తెలిసిందన్న ఆయన ఆ నేతలకు రూ.500 కోట్ల ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు.తమ నేతలకు సైతం ఏఐసీసీ క్లాస్ తీసుకుందని తెలిపారు.

సునీల్ కనుగోలు రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు.సునీల్ కనుగోలు కార్యాలయంపై దాడి వెనుక చాలా కారణాలున్నాయని పేర్కొన్నారు.

మార్జిన్ తో గెలిచే నేతలను టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నారని, ఈ విషయం కుమారస్వామికి కూడా తెలియదని చెప్పారు.బీఆర్ఎస్ మీటింగ్ కు కుమారస్వామి రాకపోవడానికి అదే కారణమని తెలిపారు.

Advertisement

ఫిబ్రవరి చివరి వారంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని వెల్లడించారు.

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...
Advertisement

తాజా వార్తలు