నల్లగొండ జిల్లా:హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సులో గురువారం రాత్రి మంటలు చెలరేగాయి.హైదరాబాద్ నుండి 45 మంది ప్రయాణికులతో విజయవాడకు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నల్లగొండ జిల్లా చిట్యాల వద్దకు రాగానే టైర్ పేలి,ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
దీనితో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.