టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సునీత రెండవ వివాహం తర్వాత ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుందని చెప్పవచ్చు.ఈమె గత ఏడాది మొదట్లో రామ్ వీరపనేని రెండవ వివాహం చేసుకున్న తర్వాత పెద్ద ఎత్తున ఈమె గురించి విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే ప్రస్తుతం ఈమె వివాహం తర్వాత ఎంతో ఆనందంగా ఉందని స్వయానా సునీత ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ గా ఎంతో బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.
ఈ క్రమంలోనే నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా సునీతకు పాటలు పాడటమే కాకుండా వ్యవసాయం చేయడం కూడా ఇష్టం అంటూ తన ఇంటిలో తోటపని చేస్తూ ఉన్న ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా సింగర్ సునీత కూతురు శ్రేయ పాడిన ఒక పాటను తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప పాటలు మనకు వినపడుతూనే ఉన్నాయి.
శ్రేయ సైతం కూడా ఈ పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటను ఎంతో అద్భుతంగా పాడింది.ఈ క్రమంలోనే శ్రీవల్లి పాటకు సంబంధించిన ఈ వీడియోని సునీత సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు తెలుగు మరికాస్త స్పష్టంగా నేర్చుకోవాల్సి ఉంటుందని ఆమెకు సలహాలు ఇవ్వగా మరికొందరు చాలా అద్భుతంగా పాడవని కామెంట్లు చేస్తున్నారు.
ఇక శ్రేయా ఇదివరకే కీరవాణి సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన సవ్యసాచి చిత్రంలో ఒక పాటను పాడారు అయితే తన మొదటి పాట తనకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి.