ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో మోస్ట్ పాపులర్ అయిన యామీ గౌతం నెమ్మదిగా వెండితెర వైపు అడుగులు వేస్తోంది.అయితే ఇప్పటికే అల్లు శిరీష్ సరసన గౌరవం, నితిన్ తో జత కట్టి కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాలు చేసినప్పటికీ ఆ సినిమాలు అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాయి.
ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ లో పలు చిత్రాలలో నటించిన యామీ గౌతం తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకుంది.అయితే ప్రస్తుతం తెలుగులో ‘గిన్ని వెడ్స్ సన్నీ’ అనే చిత్రం ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది.
ఇప్పటికే థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల ఆగిపోయింది.అయితే ఈ చిత్రం ఈరోజు ఓటిటీ ప్లాట్ ఫామ్ లో విడుదల కానుంది.యామీ గౌతం తాజాగా నేషనల్ మీడియాతో జరిపిన చిట్ చాట్ లో డేటింగ్ పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు.నేను పాత కాలానికి చెందిన రొమాన్స్ వ్యక్తిని మాత్రమే కానీ, ప్రస్తుతం ఉన్న డేటింగ్ సంస్కృతితో నేను పోటీ పడలేననీ, యామీ గౌతం పేర్కొన్నారు.
మనం బ్రతుకుతున్నది డిజిటల్ కాలంలో అని, ఈ ప్లాట్ ఫామ్ లో జీవిత భాగస్వామిని వెతుక్కునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి.ఉన్నాయని, దీంతో పాటు అనేక సమస్యలను కూడా ఎదుర్కోవల్సి వస్తుందని తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచం అలా మారిపోయిందని, వాటితో కనెక్ట్ అవ్వాలంటే చాలా కష్టమని,ఆమె పేర్కన్నారు.పట్టణాలలో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని వెలితిగానే ఉంటుంది.
అదృష్టవశాత్తూ నేను చదువుకుంటున్నప్పుడు స్కూలు రోజుల్లో, లేదా కాలేజీ రోజుల్లో అబ్బాయిలు నన్ను విసిగించడం వంటివి ఎవరు చేయలేదు.బహుశా వారికి నేనంటే భయమెమో లేదంటే నేను కొడతా అని భయపడి వారు నా దగ్గరకు రాకపోవచ్చు అని యామీ గౌతం తెలిపారు.