మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.కరోనా కారణంగా ఆ సినిమా దాదాపు ఏడు నెలలుగా వాయిదా పడుతూ వచ్చింది.
వచ్చేనెల లేదా మరి కాస్త ఆలస్యంగానైనా షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని దర్శకుడు కొరటాల ఇటీవలే పేర్కొన్నాడు.ఇక కొరటాల శివతో సినిమా పూర్తి అయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి వరుసగా చేసేందుకు గాను మూడు సినిమాలు ఇప్పటికే రెడీగా ఉన్నాయి.
ఆ మూడు సినిమాలకు ఈ ముగ్గురు దర్శకత్వం వహించబోతున్నారు.మొదటగా తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి చేయబోతున్నట్లు గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి.
అదే సమయంలో మలయాళం సూపర్ హిట్ మూవీ లూసీఫర్ ను చిరంజీవి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారని మొదట రీమేక్ బాధ్యతలను సుజిత్ చేతిలో పెట్టగా ఆయన స్క్రిప్టు విషయంలో చిరంజీవి నిరాశపరిచాడని దాంతో ఆ రీమేక్ వినాయక్ చేతికి వెళ్ళింది.
ప్రస్తుతం ఆయన లూసిఫర్ ను తనదైన శైలిలో కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందించేందుకు గాను స్క్రిప్టును రెడీ చేస్తున్నారు.
భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రారంభించేందుకు సిద్ధంగా వినాయక్ ఉండబోతున్నాడు.ఇక ఇదే సమయంలో వెంకి మామ దర్శకుడు బాబీ కూడా మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పి ఓకే చెప్పించుకున్నాడు.
ఆయనకు కూడా చిరంజీవి డేట్లు ఇస్తానంటూ ఓకే చెప్పడంతో వెయిట్ చేస్తున్నాడు.మొత్తానికి ఈ ముగ్గురు దర్శకులు కూడా చిరంజీవి డేట్ల కోసం వెయిట్ చేస్తున్నారు.నేడు వినాయక్ బర్త్ డే సందర్భంగా ఆయన తో దిగిన సెల్ఫీని షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ ముగ్గురిలో మెగాస్టార్ చిరంజీవి ఎవరికీ ముందుగా డేట్లు ఇస్తాడు అనేది ఇంకా స్పష్టత రాలేదు.
కాని ఈ ముగ్గురు కూడా మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తున్నాయి.వచ్చే రెండు ఏళ్లలో మెగాస్టార్ చిరంజీవి వీరితో చేయబోతున్న సినిమాలు వరుసగా విడుదల కాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు.