తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( Telangana CM Revanth Reddy )కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని విమర్శించారు.
ఓయూకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.గత సంవత్సరంలో కూడా నెల రోజుల పాటు ఓయూ హాస్టళ్లు, మెస్ లను మూసివేశారని పేర్కొన్నారు.
అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతే యూనివర్సిటీని మూసివేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేయడం కేసీఆర్( KCR ) దిగజారుడుతనానికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.కావాలనే తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలను చేస్తున్నారని ధ్వజమెత్తారు.