ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు( Chandrababu ) వస్తే జాబు వస్తుందన్నారు.
అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ఇచ్చింది కేవలం 32 వేల ఉద్యోగాలేనని తెలిపారు.వైసీపీ( YCP ) అధికారంలోకి వచ్చిన తరువాత 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు రిపోర్ట్ చదువుల విషయంలో బోగస్ కాదా అని ఆయన ప్రశ్నించారు.
తనది ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్న సీఎం జగన్( AP CM Jagan ) చంద్రబాబుది బోగస్ రిపోర్ట్ అంటూ విమర్శించారు.అదేవిధంగా వ్యవసాయం దండగ అని చంద్రబాబు అనలేదా అని నిలదీశారు.
రైతులపై కాల్పులు జరిపించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.చంద్రబాబు ఏనాడైనా రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చారా అని ప్రశ్నించిన సీఎం జగన్ చంద్రబాబు డెవలప్ మెంట్ కింగ్ ఎలా అవుతారో చెప్పాలన్నారు.
అలాగే వెలిగొండ నీటిని ప్రకాశం జిల్లాకు తెచ్చింది ఎవరన్నారు.మ్యానిఫెస్టోలో చెప్పిన హామీల్లో ఒక్కటైనా బాబు అమలు చేశారా ప్రశ్నించారు.