ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!

ఆదివారం హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ( Ebrahim Raisi ) మరణించడం అందరికీ షాక్ ఇచ్చినట్లు అయింది.ఇరాన్.

 Due To The Death Of The President Of Iran Indian Government Has Declared Mournin-TeluguStop.com

భారత్ దేశాల మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి.అంతర్జాతీయ పరంగా కొన్ని విషయాలలో అనేకమార్లు ఇరాన్ దేశానికి భారత్ అండగా నిలిచింది.

ఈ నేపథ్యంలో ఇబ్రహీం రైసీ మృతి కారణంగా భారత ప్రభుత్వం ఈ నెల 21న సంతాపదినం పాటించనున్నట్లు ప్రకటించింది.రైసీ గౌరవార్థం ఆ రోజున దేశవ్యాప్తంగా జాతీయజెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది.1989లో ఇరాన్ తొలి సుప్రీంలీడర్ అయతొల్లా రుహోల్లా ఖొమేనీ మరణించిన సమయంలో భారత్ 3 రోజులు సంతాప దినాలు పాటించింది.

ఇబ్రహీం రైసీ మృతి పట్ల అనేక అనుమానాలు నెలకొన్నాయి.వాతావరణం లేదా పైలెట్ పొరపాటు కారణంగా.ఈ ఘోరం జరిగిందా అన్నది ఎవరికి అర్థం కావటం లేదు.

ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ తో పాటు మరో రెండు హెలికాప్టర్లు కూడా బయలుదేరాయి.అవి సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి.

కానీ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం పలు అనుమానాలకు తావిస్తుంది.ఆల్రెడీ గత కొన్ని వారాల నుండి ఇరాన్.

ఇజ్రాయెల్( Israel ) దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.ఇరాన్ కొన్ని రాకెట్లను కూడా ఇజ్రాయెల్ పై దాడికి పాల్పడటం జరిగింది.

ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మరణించడంతో…ఇజ్రాయెల్ పై అనుమానాలు నెలకొన్నాయి.ఇబ్రహీం రైసీ మృతికి కారణం ఇజ్రాయెల్ గూడచార సంస్థ మోసాద్ అయ్యుండొచ్చని కామెంట్లు వస్తున్నాయి.

మరోపక్క ఇరాన్ అధ్యక్షుడు మరణానికి తమకి ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ ప్రకటన విడుదల చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube