తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకు( Balayya Babu ) చాలా మంచి గుర్తింపైతే ఉంది.ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఉండటం విశేషం… ఇక సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఆయన చేసిన ఆదిత్య 369( Aditya 369 ) సినిమా నాలుగోవ తేదీన రీ రిలీజ్ అవుతుంది.
అయితే ఈ సినిమాని చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇండియాలోనే మొట్టమొదటి టైం ట్రావెల్ సినిమాగా ఈ సినిమా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

అప్పట్లో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమాను యావత్ తెలుగు ప్రేక్షకులందరు ఆసక్తిగా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండటం విశేషం…ఇక ఈ సినిమా రీ రిలీజ్ కి భారీ సంఖ్యలో టికెట్లు అమ్ముడుపోయాయి.చాలా మంది ప్రేక్షకులు థియేటర్ లో ఈ సినిమా చూడడానికి అసక్తి చూపించే అవకాశమైతే ఉంది.మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోగలిగే కెపాసిటి ఉన్న స్టార్ హీరోలలో బాలయ్య బాబు ఒకరు.బాలయ్య బాబు చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

ఇక రీ రిలీజ్ లో కూడా సూపర్ సక్సెస్ ని సాధించాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.ఇక ఈ సినిమాతో పాటుగా అఖండ 2( Akhanda 2 ) సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.మరి ఈ సినిమా సైతం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.కాబట్టి తొందర్లోనే కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు కూడా చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో ఇంకా యాక్షన్ డోస్ మరింత ఎక్కువగా పెంచినట్టుగా కూడా తెలుస్తోంది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…
.