ప్రపంచవ్యాప్తంగా నిత్యం అనేక దుర్ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి.అగ్నిప్రమాదాలు, భూకంపాలు, బిల్డింగ్ కూలిపోయే ఘటనలలో ఎంతో మంది అమాయకుల ప్రాణాలను హరించేస్తుంటాయి.
అలాంటి ఘోర సంఘటనే తాజాగా డొమినికన్ రిపబ్లిక్( Dominican Republic ) రాజధాని శాంటో డొమింగోలో చోటుచేసుకుంది.ఓ నైట్ క్లబ్లో( Night Club ) జరిగిన ప్రమాదం ఒక్కసారిగా దేశాన్ని విషాదంలో ముంచేసింది.
శాంతో డొమింగోలోని( Santo Domingo ) ఓ ప్రముఖ నైట్ క్లబ్లో అర్ధరాత్రి సమయంలో 12:44కి ఈ ఘోర ప్రమాదం జరిగింది.క్లబ్ నిర్వహణ కొనసాగుతున్న సమయంలో ఓపెన్ రూఫ్ టాప్ విరిగిపడడంతో కింద ఉన్న వారిపై కూలిపోయింది.ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 184 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.145 మందికి పైగా గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.అయితే శిథిలాల కింద ఇంకా కొన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉన్నందున, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ ఘటన సమయంలో ప్రముఖ డొమినికన్ సింగర్ రబ్బి పెరేజ్ స్టేజ్పై ప్రదర్శన ఇస్తున్నాడు.వీడియో ఫుటేజ్ ప్రకారం, అతను పెర్ఫార్మ్ చేస్తున్న సమయంలోనే పైకప్పు ఒక్కసారిగా విరిగి కిందపడింది.ఈ అనూహ్య ఘటనతో క్లబ్లో ఉన్నవారు భయంతో పరుగులు తీశారు.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, మొదట ఇది భూకంపం అనుకొని షాక్కి గురయ్యారట.పెరేజ్ కూతురు జిలింకా ప్రకారం, ఆయన ప్రాణాలతోనే ఉన్నట్టు సమాచారం.
ఈ క్లబ్కి కెపాసిటీ కేవలం 700 మంది మాత్రమే అయినా, 1000 మంది వరకు హాజరయ్యారని స్థానిక మీడియా తెలిపింది.అనుమతి మేరకు కాకుండా అధిక సంఖ్యలో అనుమతినివ్వడం వల్లే ఇలాంటి ఘోరం చోటు చేసుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రమాదంలో చనిపోయినవారిలో ఒక గవర్నర్, ఇద్దరు బేస్బాల్ ప్లేయర్లు, మరొకొందరు పాపులర్ వ్యక్తులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో, కుటుంబ సభ్యులకు అప్పగించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ప్రస్తుతం డెడ్ బాడీలను గుర్తించేందుకు DNA టెస్టులు చేసే అవకాశం ఉంది.ఘటన జరిగిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్స్ ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.370 మందికి పైగా రెస్క్యూ సిబ్బంది శిథిలాల తొలగింపులో పాల్గొన్నారు.స్టీల్ కాంక్రిట్ కారణంగా సహాయక చర్యలు కాస్త ఆలస్యం అవుతున్నాయి.
శిథిలాల కింద చిక్కినవారిని వెలికితీసేందుకు క్రేన్లను వినియోగిస్తున్నారు.
ఈ ఘటనతో డొమినికన్ రిపబ్లిక్ మొత్తం విషాదంలో మునిగిపోయింది.
ప్రెసిడెంట్ అభిందర్ స్వయంగా సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.బాధిత కుటుంబాల కోసం ప్రభుత్వం ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టింది.50 ఏళ్లుగా నడుస్తున్న ఈ క్లబ్పై విచారణ కూడా ప్రారంభమైంది.డొమినికన్ రిపబ్లిక్ టూరిజం మీద ఈ ఘటన ప్రభావం చూపే అవకాశముంది.2024లో దాదాపు 11 మిలియన్ల టూరిస్టులు ఈ దేశాన్ని సందర్శించారు.టూరిజం ద్వారా దేశానికి 15% జీడీపీ లభిస్తోంది.
కరేబియన్ దీవులు, మ్యూజిక్, నైట్ లైఫ్తో పాపులర్గా నిలిచిన ఈ దేశంలో ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో తగ్గేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.