సినీ నటుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar)అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.సింగపూర్లో తన తల్లితో పాటు నివసిస్తున్నటువంటి మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఈ అగ్నిప్రమాదంలో(Fire Accident) భాగంగా మార్క్ శంకర్ కూడా గాయాలు పాలయ్యారని తెలుస్తుంది.ఈ చిన్నారి కాళ్లు చేతులు స్వల్ప గాయాలు కాగా పొగ కారణంగా అస్వస్థతకు కూడా గురైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నారనే విషయం మెగా అభిమానులకు జనసైనికులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.అయితే ప్రస్తుతం చిన్నారి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.అయితే చిన్నారి మార్క్ ప్రమాద ఘటనపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) స్పందించారు.

ఈ సందర్భంగా చిరంజీవి చిన్నారి ఆరోగ్యం గురించి మాట్లాడుతూ…ప్రస్తుతం 8 ఏళ్ల వయసున్న మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది.కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయని చిరంజీవి పేర్కొన్నారు.ఈ చిన్నారి గాయాలు పాలయ్యారు అనే విషయం తెలిసిన వెంటనే సినిమా సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ ఈ చిన్నారి క్షేమంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.ఇప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు అదేవిధంగా మాజీ మంత్రి కేటీఆర్, వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఈ ప్రమాద ఘటన పై స్పందిస్తూ చిన్నారి గాయాల నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.