గడిచిన 2 రోజుల్లో దేశ వ్యాప్తంగా పెద్దెత్తున రాములవారి పండుగ శ్రీరామనవమిని పెద్దెత్తున ప్రజలు జరుపుకున్నారు.అయితే ఈ పండుగ ఓ ఎమ్మెల్యేకు తలనొప్ప్పిగా మారింది ఇప్పుడు.
అసలు విషయంలోకి వెళితే. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి (Virupakshi, MLA of Alur, Kurnool district)తీరుపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో (Sri Ramanavami celebrations)భాగంగా చిప్పగిరి గ్రామంలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొన్నారు.అయితే ఈ వేడుక సందర్భంగా ఆయన చేసిన ఒక చర్య ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
సాధారణంగా శ్రీరాములవారి(SRI RAMA) తరపున అర్చకులు తాళిబొట్టును సీతమ్మ మెడలో ఉంచడం సంప్రదాయం.పూజారులు మంగళసూత్రాన్ని భక్తులకు చూపించి, అర్చన చేసి, ఆ తాళిని అమ్మవారికి ఉంచే విధానం ఉంది.
అయితే ఈసారి పండితులు మంగళసూత్రాన్ని ఎమ్మెల్యే విరూపాక్షికి ఇచ్చారు.దీంతో విరూపాక్షి స్వయంగా సీతాదేవి మెడలో తాళిబొట్టు వేయడం జరిగింది.
ఈ దృశ్యం వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు, ప్రజలు పెద్దేత్తున్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చర్య భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని, ఒక ప్రజా ప్రతినిధిగా ఆయన మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిందని నెటిజన్లు మండిపడుతున్నారు.“చుట్టుపక్కల ఉన్నవారైనా ఈ విషయాన్ని చెప్పి ఉండాలి కదా?” అంటూ అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.పండితులు కూడా దీనిని అడ్డుకోకుండా అక్షింతలు వేసిన విధానం పై కూడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
అయితే, ఈ వివాదంపై ఎమ్మెల్యే విరూపాక్షి స్పందించారు.ఆయన మాట్లాడుతూ.
, “తాళి చూపించి, కళ్ళకు అద్దుకోవాలని పండితులు ఇచ్చారు.పొరపాటున అమ్మవారి మెడలో తాళి కట్టేశాను” అని వివరించారు.
తనకు దేవుళ్ల పట్ల అపారమైన భక్తి ఉందని, 15 సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేసుకుంటున్నాను అంటూ భక్తి భావాన్ని ప్రదర్శించారు.ఈ ఘటన అనుచితంగా జరిగిందని ఆయన క్షమాపణలు కూడా కోరారు.
ఈ ఘటనతో మళ్లీ రాజకీయ నాయకులు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్న చర్చ ప్రారంభమైంది.సమాజంలో ఉన్న సంప్రదాయాల పట్ల గౌరవం చూపడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి ఎమ్మెల్యే విరూపాక్షి స్పష్టత ఇచ్చినప్పటికీ, ఈ ఘటనపై ట్రోల్ల్స్ ఇంకా కొనసాగుతున్నాయి.