ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) భారత రాజకీయాల్లో అనుభవజ్ఞుడిగా, అభివృద్ధి శీల నేతగా పేరుగాంచారు.ఐటీ రంగాన్ని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసి “హైటెక్ సిటీ”గా హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పడిన విజనరీ నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ప్రస్తుతం తన నేతృత్వంలో తెదేపా ప్రభుత్వం అమరావతిని ప్రజల రాజధానిగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.ఇందులో భాగంగా, బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో తన సొంత ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, కోడలు నారా బ్రాహ్మిణి, మనవడు దేవాంశ్ (Nara Bhuvaneshwari, son State IT Minister Nara Lokesh, daughter-in-law Nara Brahmini, grandson Devansh)తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఈ9 రహదారి పక్కన, వెలగపూడి సచివాలయం వెనుకభాగంలో ఐదు ఎకరాల భూమిలో ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు.జీ ప్లస్ 1 మోడల్లో(Zee Plus 1 model) నిర్మించబోయే ఈ గృహ నిర్మాణం ఏడాదిలోపు పూర్తి చేసి గృహప్రవేశం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.ఇకపోతే, సీఎం చంద్రబాబు కాన్వాయ్ అమరావతికి చేరుకునే సమయంలో స్థానిక రైతులు “జై చంద్రబాబు, జై అమరావతి” అనే నినాదాలతో ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు.
దానితో సీఎం కాన్వాయ్ ఆపి, ఆయన స్వయంగా రైతులను పలకరిస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు.అదే సమయంలో మంత్రి లోకేశ్ ( Nara Lokesh)కూడా రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు ముఖ్యమంత్రి కుటుంబానికి పట్టు వస్త్రాలు సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక కట్టబోయే ఇంటి నిర్మాణ ప్రణాళికను కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేశ్( Nara Lokesh) స్వయంగా వివరించారు.అనంతరం భూమిపూజ కార్యక్రమం పూర్తి చేసి సీఎం చంద్రబాబు కుటుంబం ఉండవల్లికి బయలుదేరారు.ఈ కార్యక్రమం ద్వారా అమరావతిలో సొంత ఇంటి నిర్మాణంతో చంద్రబాబు ప్రజలకూ, రైతులకూ తన కట్టుబాటును మరోసారి చాటారు.
ప్రజల రాజధాని సాధనలో ఇది ఓ కొత్త మైలురాయి అయ్యిందనడంలో సందేహం లేదు.