ప్రస్తుతం యువతలో సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోతోంది.తమ సమయాన్ని ఎంతోమంది యువత నెట్టింటే గడిపేస్తున్నారు.
కొందరు వీడియోలు, మీమ్స్, రీల్స్ (Videos, memes, reels)చూస్తూ టైం పాస్ చేస్తుంటే.మరికొందరు వాటిని రూపొందించడానికే తమంతట వారు రంగంలోకి దిగుతున్నారు.
ఇందులో కొన్ని రీల్స్ నిజంగానే ప్రజలకు ఉపయోగపడే సమాచారం ఇస్తుంటే, మరికొన్ని మాత్రం అర్థం లేని, ప్రమాదకరమైనవిగా తయారవుతున్నాయి.ఇకపోతే తాజాగా, రీల్స్ మోజులో(Reels are in a frenzy.
) మునిగిపోయిన కొంతమంది యువత తమ ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటున్నారు.వినోదం కోసం ప్రారంభించిన ఈ ప్రక్రియ, ఇప్పటివరకు చాలా మంది ప్రాణాలను బలితీసుకుంది.
రోడ్డు మధ్యలో రద్దీ వాహనాల్లో వీడియోలు తీస్తూ ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు.కొందరు పోలీసు కస్టడీకి కూడా లోనవుతున్నారు.
తాజాగా, ఇలాంటి ఘటనే నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని ఈగలపెంటలో (Eagalapenta, Amrabad Mandal, Nagar Kurnool District)చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన ఎస్సై బంధువులు పోలీసు వాహనాన్ని తీసుకెళ్లి అందులో రీల్స్ చేశారు.వాహనంతో ఊరిలో రెండు రౌండ్లు తిరిగి కొన్ని వీడియోలు తీశారు.అంతటితో ఆగకుండా కారులో కూర్చొని మరికొన్ని రీల్స్ రూపొందించి వాటిని నెట్టింట పెట్టేశారు.ఈ వ్యవహారం అక్కడి సీఐ దృష్టికి రావడంతో, ఆయనే స్వయంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.పోలీసు వాహనాలను వినోదానికి వినియోగించడమే కాకుండా, అధికార వ్యవస్థను అపహాస్యం చేసేలా ఈ చర్యలు ఉండటం తీవ్రంగా పరిగణించాలని ఆయన పిర్యాదు చేసారు.
ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటన ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది.సోషల్ మీడియా మోజు(Social media craze) ఎంతవరకు పెరిగిందో తీసుకెళ్తుందో.యువత తన భవిష్యత్తును శ్రద్ధగా తీర్చిదిద్దుకునే వయస్సులో, ఇలాంటి అప్రమత్తత లేని చర్యలు తమ జీవితాలను తారుమారు చేయవచ్చు.
నెట్లో వెలుగు చూస్తే గుర్తింపు లభిస్తుంది అనే మాయలో కాకుండా, భద్రతా పరంగా బేధించుకునే అవసరం ఉంది.