తమిళనాడులోని(Tamil Nadu) వాల్పారైలో నిన్న సాయంత్రం ఓ షాకింగ్ ఘటన జరిగింది.జనాలు నివాసం ఉండే ఏరియాలోకి ఓ చిరుతపులి(Leopard) దూసుకొచ్చింది.
ఆడుకుంటున్న ఓ పిల్లాడిని టార్గెట్ చేసి మరీ వెంటాడింది.ఇంకేముంది, గుండెలు గుభేలుమనే సీన్ అది.కానీ అదృష్టం కొద్దీ ఆ పిల్లాడు క్షేమంగా బయటపడ్డాడు.కారణం ఏంటో తెలుసా, వీధి కుక్కలు.
అవును, రెండు కుక్కలు గట్టిగా మొరగడంతో చిరుత భయపడి పారిపోయింది.లేదంటే సీన్ వేరేలా ఉండేది.
సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శివకుమార్, సత్య అనే దంపతుల ఇంటి దగ్గర ఈ ఘటన జరిగింది.వీళ్లు వాల్పారై రోటీ షాపు దగ్గర ఉంటారు.
వాళ్ల చిన్న కొడుకు ఇంటి వెనకాల ఆడుకుంటున్నాడు.ఇంతలో సడన్గా ఓ చిరుత(Leopard) ఎంట్రీ ఇచ్చింది.
పిల్లాడే టార్గెట్ అన్నట్టుగా దూసుకొచ్చింది.కానీ ఇంతలో అక్కడున్న రెండు కుక్కలు గట్టిగా గర్జించాయి.
పిల్లాడు కూడా భయంతో కేకలు వేశాడు.దాంతో చప్పుడుకి చిరుత వెనక్కి తిరిగి పరుగు లంకించుకుంది.
ఈ సీన్ మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది.ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పేరెంట్స్, చుట్టుపక్కల వాళ్లు సీసీటీవీ ఫుటేజ్(CCTV footage) చూస్తే.చిరుత నిజంగానే వచ్చిందని, పిల్లాడిని అటాక్ చేయడానికి ట్రై చేసిందని తేలింది.
దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు.
ఇదిలా ఉండగా, వాల్పారైలో చిరుతల భయం మళ్లీ మొదలైంది.ఎందుకంటే కొన్ని రోజుల కిందటే ఇదే ప్రాంతంలో ఓ విషాదకర ఘటన జరిగింది.సైతూ అనే నాలుగేళ్ల పిల్లాడిని చిరుత చంపేసింది.
సైతూ వాళ్ల నాన్న ముషారఫ్ అలీ, అమ్మ సఫియా(Musharraf Ali, mother Safiya).వీళ్లు జార్ఖండ్ నుంచి వలస వచ్చి టాటా టీ తోటల్లో పనిచేస్తున్నారు.రెండేళ్ల కిందటే వాల్పారైకి షిఫ్ట్ అయ్యారు.
వాల్పారైలో అడవి జంతువుల దాడులు ఎక్కువైపోయాయి.గత కొన్నేళ్లలో పులులు కనీసం పది మందిని చంపేశాయి.ఓసారి పులి ఏకంగా ఇళ్లల్లోకి కూడా వచ్చేసింది.
దీంతో జనాలు భయంతో వణికిపోతున్నారు.ఈ వరుస ఘటనలు చూస్తుంటే, వాల్పారైలో మనుషులకి, అడవి జంతువులకి మధ్య గొడవలు ఎక్కువవుతున్నాయని అర్థమవుతోంది.
జనాలు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.ఏం జరుగుతుందో అని భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.