ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి( Venu Swamy ) నిత్యం ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూ ఇటీవల కాలంలో వివాదాలలో నిలుస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటివరకు పలువురు సెలబ్రిటీలు రాజకీయ నాయకుల గురించి ఈయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తాజాగా వేణు స్వామి నటుడు మహేష్ బాబు( Mahesh Babu ) గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రదుమారం రేపడమే కాకుండా మహేష్ బాబు అభిమానుల ఆగ్రహానికి కూడా గురి అవుతున్నారని చెప్పాలి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి వేణు స్వామి మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు.తాను 1995 వ సంవత్సరం నుంచి కృష్ణ( Krishna ) గారి ఇంట్లో పూజలు చేయటానికి వెళ్లేవాడిని అయితే 2020వ సంవత్సరంలో తాను మహేష్ బాబు కుటుంబ సభ్యుల జాతకాలను చెప్పానని వెల్లడించారు. ఆ సమయంలో విజయనిర్మల( Vijaya Nirmala ) జాతకాలు ఎలా ఉన్నాయి అని అడిగారు.
ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా మాట్లాడటం నాకు అలవాటు అందుకే త్వరలోనే మీ కుటుంబంలో వరుస మరణాలు సంభవిస్తాయి అని చెప్పడంతో అప్పటినుంచి వారు నన్ను పూజలు చేయడానికి పిలవలేదు.

నేను జాతకం చెప్పిన సమయంలో మహేష్ బాబు గ్రహస్థితి శని గ్రహంలోకి వెళ్తోంది.తద్వారా జనవరి 16 నుంచి తన కుటుంబంలో చెడు జరుగుతుంది అని చెప్పాను.మహేష్ బాబు గ్రహస్థితి కారణంగానే కృష్ణ మరణించారు అంటూ ఈయన మాట్లాడారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో మహేష్ బాబు అభిమానులు తీవ్రస్థాయిలో వేణు స్వామి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలా ఒక వ్యక్తి సహజ మరణానికి మరొక వ్యక్తి జాతకం కారణం అంటూ మాట్లాడటం సరైంది కాదంటూ వేణు స్వామి పై విమర్శలు కురిపిస్తున్నారు.