ఏపీలో పోలింగ్ అనంతరం అల్లర్లపై సిట్ నివేదిక సిద్ధం..!!

ఏపీలో పోలింగ్( AP Polling ) ముగిసిన అనంతరం చోటు చేసుకున్న అల్లర్లపై ప్రత్యేక విచారణ బృందం (సిట్) నివేదిక సిద్ధం చేస్తుంది.ఈ మేరకు ప్రాథమిక నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్( SIT Chief Vineet Brij Lal ) సాయంత్రం డీజీపీకి అందించనున్నారు.

 Sit Report Ready On Riots After Polling In Ap Details, Ap State, Riots After Pol-TeluguStop.com

కాగా ఇప్పటికే అల్లర్లు జరిగిన ప్రాంతంలో కేసుల విచారణపై సిట్ సమీక్ష పూర్తి చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే కేసుల విచారణపై సిట్ ( SIT ) పర్యవేక్షణ కొనసాగించనుంది.

అయితే రెండు రోజుల్లో సమాచార సేకరణకే సమయం సరిపోయిన నేపథ్యంలో లోతైన దర్యాప్తు కోసం గడువు పొడిగించాలని సిట్ అధికారులు డీజీపీని ( DGP ) కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.కాగా డీజీపీ ప్రాథమిక నివేదికను ఎన్నికల సంఘానికి పంపుతారు.

ఈ క్రమంలో సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోనుందనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube