ఏపీలో పోలింగ్ అనంతరం అల్లర్లపై సిట్ నివేదిక సిద్ధం..!!

ఏపీలో పోలింగ్( AP Polling ) ముగిసిన అనంతరం చోటు చేసుకున్న అల్లర్లపై ప్రత్యేక విచారణ బృందం (సిట్) నివేదిక సిద్ధం చేస్తుంది.

ఈ మేరకు ప్రాథమిక నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్( SIT Chief Vineet Brij Lal ) సాయంత్రం డీజీపీకి అందించనున్నారు.

కాగా ఇప్పటికే అల్లర్లు జరిగిన ప్రాంతంలో కేసుల విచారణపై సిట్ సమీక్ష పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే కేసుల విచారణపై సిట్ ( SIT ) పర్యవేక్షణ కొనసాగించనుంది.

అయితే రెండు రోజుల్లో సమాచార సేకరణకే సమయం సరిపోయిన నేపథ్యంలో లోతైన దర్యాప్తు కోసం గడువు పొడిగించాలని సిట్ అధికారులు డీజీపీని ( DGP ) కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా డీజీపీ ప్రాథమిక నివేదికను ఎన్నికల సంఘానికి పంపుతారు.ఈ క్రమంలో సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోనుందనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

నేడే దాయాదుల పోరు.. తప్పక గెలవాల్సిందే.. లేకపోతే ఇంటికే